మార్చ్ 17 జనగాం అధికారులు పారదర్శకంగా పని చేయాలి విధులు, బాధ్యత లను విస్మరించవద్దు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రెవిన్యూ కి సంబందించిన ఏ అంశాలు పెండింగ్ లో పెట్టకూడదని...నిర్దేశిత కాలం లో పూర్తి చేయాలనీ, క్షేత్ర స్థాయి లో ఎప్పటికప్పుడు పనులు పూర్తి అయితేనే సత్ఫలితాలు సాధ్యమవుతాయని
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తహసీల్దార్ లను ఆదేశించారు
మంగళవారం,
భూ భారతి, ఇసుక తరలింపు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సెన్సస్ తదితర అంశాల మీద కలెక్టరెట్ లోని మినీ కాన్ఫెరెన్స్ హల్ లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీవోలు, తహసీల్దార్ లతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రివ్యూ నిర్వహించారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ... భూ భారతి కి
సంబందించిన దరఖాస్తు లను వేగవంతం గా పరిష్కరించాలన్నారు
తహసీల్దార్ ల వారీగా లక్ష్యాలను కలెక్టర్ నిర్దేశించారు
ఇసుక తరలింపు గురించి మాట్లాడుతూ... అక్రమ ఇసుక, మొరం, గ్రావెల్ అక్రమ రవాణా కాకుండా.. నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు
ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను, అలాగే
జనాభా లెక్క ల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని,యస్సు, విద్యార్హత, వృత్తి, సామాజిక వర్గం, మౌలిక వసతుల వివరాలు వంటి అంశాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని, మొత్తం అన్నీ అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాలని కలెక్టర్ తెలిపారు
తహసీల్దార్ లు తమ
అధికారాలను, బాధ్యత లను సమర్థవంతంగా
నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు