Banner
Watermark
శాశ్వత పరిష్కారం చూపిన ప్రజా ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన రైతులు,నాయకులు.
📅 14 March 2026, 01:38 PM ✍️ admin
News Image
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ఎక్స్ రోడ్ లో మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన స్వాగతం పలికిన మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు

.కాళేశ్వరం 11వ ప్యాకేజి పరిధిలోని LM-4,LM-6 కాల్వ పెండింగ్ పనులకు రూ. 3.19 కోట్లను మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రైతులు

. జిల్లెల్ల ఎక్స్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించిన కవ్వంపల్లి, కాంగ్రెస్ నేతలు

.ప్రజా ప్రభుత్వంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి అండగ ఉంటామని పేర్కొన్న ఎమ్మెల్యే

. అనంతరం తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె టోనీ ఆధ్వర్యంలో కెకె మహేందర్ రెడ్డి గారి కృషివల్ల మండల రైతులకు శాశ్వత పరిష్కారం చూపనందుకు రైతులతొం కలిసి ప్రజా ప్రభుత్వ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు నాగేశ్వర్ రావ్,శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్ది చిత్ర పటాలకు పాలాభిషేకం చేసిన నాయకులు, రైతులు

. గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యనికి గురైనా కాల్వ పనులు ప్రజా ప్రభుత్వంలో ప్రారంభం కాబోతున్నాయని పేర్కొన్న ప్రవీణ్ టోనీ

. రాబోయే కాలంలో ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరు అండగా ఉండలని పిలుపు
ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్, సీనియర్ నాయకులు , మండల రైతులు పాల్గొన్నారు.
🏠 Home