మార్చ్ 14 జనగాం పకడ్బందీగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఈరోజు నుంచి ప్రారంభం అయిన పదవ తరగతి పరీక్షల నిర్వహణ కు సంబందించి... సెట్ కాన్ఫెరెన్స్ ద్వారా నిర్వహించి చీఫ్ సూపరింటెండెంట్ లకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పలు సూచనలను తెలిపారు
అనంతరం సెయింట్ మేరీస్ స్కూల్ అలాగే ధర్మకంచ లోని ZPHS స్కూల్ లో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు, బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం, సిసి టివి కెమెరాల ద్వారా పర్యవేక్షణ వంటి కఠిన చర్యలను పాటించాలని కలెక్టర్ తెలిపారు
విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, డెస్కులు, సరైన వెలుతురు ఉండేలా చూడాలని...వేసవి తీవ్రత కారణంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు