జాతీయ పశు వ్యాదుల నివారణ లో భాగం గా జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గాలికుంటు వ్యాధి టీకాలకు సంబందించి...
పాలకుర్తి మండలం అయ్యవారిపల్లి గ్రామం లో మెగా క్యాంపు ని ఏర్పాటు చేయడం జరిగింది
ఈ క్యాంపు ని పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు
ఈ శిబిరం లో భాగం గా...
200 గేదె, ఆవు జాతి పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలను అలాగే 50 పశువుల కు వివిధ రకాల చికిత్సను అందించారు
సుమారు 50 మంది పాడి రైతులకు కాల్షియం సిరప్, ఖనిజ లవణల మిశ్రమ ప్యాకెట్ లను అందించారు
ఈ సందర్బంగా పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి మాట్లాడుతూ...ప శువైద్య శిబిరాల ద్వారా నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ, టీకాలు వేయడం, వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. దీని ద్వారా.... పశువుల ఉత్పాదకతను పెంచడం, వ్యాధుల నష్టాన్ని తగ్గించవచ్చన్నారు
సమయానికి పశువులకి టీకాలని వేపించాలన్నారు
అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ...పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు టీకాలు వేయించాలన్నారు
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు
ఈ కార్యక్రమం లో జిల్లా పశు, వైద్య శాఖ అధికారి డాక్టర్ మురళీధర్ రావు, AD లు డాక్టర్ రంజిత్, డాక్టర్ సారంగపాని, డాక్టర్ దేవేందర్, మండల పశు వైద్య అధికారి డాక్టర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు