గంభీరావుపేటకు డిప్యూటీ సిఎం రాక.. -హెలిప్యాడ్ ను పరిశీలించిన డిఎస్పీ
📅 21 February 2026, 11:36 AM
✍️ admin
ఈ నెల 22 న గంభీరావుపేట మండల కేంద్రానికి డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం లు బయో గ్యాస్ ప్లాంట్ కు భూమి పూజ చేయనున్నట్లు పిసి సి నాయకులు కటకం మృత్యుంజయం తెలిపారు.మంత్రులు రాక కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను సిరిసిల్ల డిఎస్పీ కత్రోజ్ నాగేంద్ర చారి, ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ గౌడ్, గంభీరావుపేట ఎస్ ఐ అనిల్ పరిశీలించారు.