Banner
Watermark
1764 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదానం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
📅 18 February 2026, 02:49 PM ✍️ admin
News Image
అన్ని దానాల్లో కెల్ల అన్నదానం మిన్న
1764 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదానం
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి
ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1764 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున కరోనా కష్టకాలం నుండి విశిష్ట సేవలు అందించిన భస్మాంగి బస్వరాజు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం లక్ష్మీగణపతి, రాజన్న, భీమేశ్వర ఆలయం వద్ద ఉన్న పేదలకు అన్నార్తులకు దాతలు అందించిన సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా సంపునూరి మల్లేశం మరియు వీరి కుమారులు కొడళ్లు శశికిషోర్ గౌడ్ వెంకట ప్రవీణ్ గౌడ్ రేణుక దివ్య గార్లు మరియు కుటుంబ సభ్యులు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వర రావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంప తులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష సాయికృష్ణ ఉన్నారని మీయొక్క పుట్టినరోజు, పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూటైనా భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 92469 39388 నంబరుకు సంప్రదించాలని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ వొద్యాల వేణు మహమ్మద్ అబ్దుల్ రఫీక్ భస్మాంగి బస్వరాజు ప్రతాప నటరాజు సగ్గు రాహుల్ పసుల శ్రీధర్ గజ్జెల శ్రీనివాస్ మరియు వంగల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home