డ్డు భద్రతపై అవగాహన కోసం వేములవాడ పట్టణంలో వాక్థాన్–రన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2 కె రన్.
రోడ్డు భద్రతపై అవగాహన కోసం వేములవాడ పట్టణంలో వాక్థాన్–రన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2 కె రన్.
ప్రజలు,యువత,విద్యార్థులు,ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో కలసి వాక్థాన్–రన్ ఫర్ రోడ్ సేఫ్టీ పోస్టర్స్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.
నేటి ప్రభాతదర్శిని రాజన్న సిరిసిల్ల జనవరి 23 :రోడ్డు భద్రత,ట్రాఫిక్ నియమలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో శనివారం రోజున ఉదయం 07:00 గంటలకు చెక్కపల్లి చౌరస్తా నుండి బలనగర్ కోర్టు గ్రౌండ్ వరకు నిర్వహిస్తున్న 2 కె రన్ లో ప్రజలు,యువత, విద్యార్థులు,ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతా,ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రమాదాలను నివారించడంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈకార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ వేంకటేశ్వర్లు, ఆర్.ఐ లు రమేష్, సురేష్, ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ రాజు పాల్గొన్నారు.