Banner
Watermark
గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు ఘనంగా ఉండాలి అధికారులు సమన్వయము తో పని చేయాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
📅 21 January 2026, 04:17 PM ✍️ admin
News Image
జనవరి 21
జనగాం
ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని... అందుకు సంబందించిన ఏర్పాట్లు ఘనం గా చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారుగణ తంత్ర దినోత్సవ ఏర్పాట్ల నిర్వహణ మీద అన్ని శాఖల అధికారులతో... అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి రిజ్వాన్ బాషా షేక్ బుధవారం కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో రివ్యూ చేసారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ....
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని.... వేడుకలు జరిగే ధర్మకంచ లోని మినిస్టేడియం లో ఆర్ అండ్ బి అధికారులు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు సంబందించిన వివరాలను ప్రసంగం రూపంలో రూపొందించాలన్నారు. దేశభక్తి పాటల మీద... ఆకట్టుకునే విధంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు వేడుకలకు హాజరయ్యే అతిధులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు, అధికారులు సిబ్బంది అందరికీ ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ అరేంజ్మెంట్స్, సౌండ్ సిస్టం, షామియానాలు, త్రాగునీరు,స్నాక్స్ అందించాలని, వేడుకలు జరిగే ప్రాంతంలో పోలీస్ సిబ్బంది భద్రత, ఫైర్ విభాగం, అధికారులు సంబంధిత సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వివిధ శాఖలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అవార్డు కోసం ప్రతిపాదనలు పంపాలని తెలిపారుజిల్లాలోనీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రోటోకాల్ ప్రకారం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని తెలిపారు అనంతరం....ఈ నెల 28 వ తేదీ నుండి 31 వరకు ములుగు జిల్లా లో జరిగే మేడారం జాతర కి సంబందించిన పోస్టర్ ని కలెక్టర్, అదనపు కలెక్టర్, డీసీపీ, ఆవిష్కరించారుఆ తరవాత రోడ్ భద్రత, డ్రగ్స్ నిరోధకం మీద సమీక్ష సమావేశం జరగిన సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.....మాదక ద్రవ్యాలను నిరోధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి నుండి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాల పైన అధికారులతో, ప్రజాప్రతినిధులతో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు, యువత కి అవగాహన కల్పంచాలన్నారు. నిరంతరం తనిఖీ లు చేస్తు... మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మాదకద్రవ్యాల నిరోధకం కేవలం ఒక వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాక సామాజిక కర్తవ్యంగా గుర్తిస్తూ మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. డ్రగ్స్‌ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారం సంబంధిత అధికారులకు తెలియజేస్తే రివార్డు అందిస్తామన్నారు. రోడ్ భద్రత నియమాలు, ప్రమాదలను అరికట్టడం అంశం మీద కలెక్టర్ మాట్లాడుతూ....రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే... నియమాలను, జాగ్రత్తలను అందరూ పాటించాలాన్నారు. ఇందులో హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించడం, వేగ పరిమితి పాటించడం, మద్యం సేవించి నడపకపోవడం, ఫోన్ వాడకుండా ఉండటం, ట్రాఫిక్ సంకేతాలను పాటించడం వంటి వాటిని...
డ్రైవర్లు, ప్రయాణీకులు, పాదచారులందరి బాధ్యత అని.... దీని ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. 1033 ఎమర్జెన్సీ, ప్రమాద హెచ్చరిక బోర్డు లు పెట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ చేయాలనీ, NH మీద లైటింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్నారు. ఈ కార్యక్రమం లో ఆర్డివో గోపి రాం, జడ్పీ సీఈఓ మాధురి షా, అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు
🏠 Home