Banner
Watermark
1735 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
📅 20 January 2026, 03:57 PM ✍️ admin
News Image
1735 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి
ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1735 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున లక్ష్మీగణపతి, రాజన్న భీమేశ్వర ఆలయం పేదలకు మరియు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా చిరంజీవి. బాసాని రతన్ సంవేద్ పుట్టినరోజు సందర్భంగా నానమ్మ గారైన బాసాని సరళ శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష సాయికృష్ణ ఉన్నారని మీయొక్క పుట్టినరోజు, పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూటైనా భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 92469 39388 నంబరుకు సంప్రదించాలని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ మహమ్మద్ అబ్దుల్ రఫీక్ పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home