జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల గారు అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, వ్యాధి నిరోధక టీకాల నిల్వలను తనిఖీ చేసి ఐదు సంవత్సరాలు లో పిల్లలందరికీ వ్యాధినిరోధక టీకాలు అందేటట్లు చూడాలని సూచిస్తూ, ఎన్ సి డి కార్యక్రమంలో( రక్తపోటు, డయాబెటిస్, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ కాన్సరు, నోటి క్యాన్సర్) పరీక్షలు నిర్వహించి ఈనెల చివరి వరకు ఆన్లైన్లో 75 శాతం ప్రగతి సాధించాలని సూచిస్తూ, గర్భిణీ స్త్రీల నమోదు తో పాటు సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని లేనియెడల చర్యలు గైకొంటామని ఈ సందర్భంగా సూచించినారు.