నేటి ప్రభాత దర్శిని, జనవరి 5 (ముస్తాబాద్-ప్రతినిధి ):
ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పిట్ల విట్టల్ అధ్యక్షతన ముస్తాబాద్ మండల ముదిరాజ్ లు సర్పంచ్ గా, ఉపసర్పంచులుగా వార్డు నెంబర్ గా,స్థానిక ఎలక్షన్లలో గెలిచిన ముదిరాజ్ లకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది.ముదిరాజ్ ముద్దుబిడ్డ బదనకల్ వాసి సర్పంచిచిగురు నరేష్ కి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ గ్రామాలలో ఉపసర్పంచులుగా, వార్డు నెంబర్లుగా గెలిచిన వారందరికీ సన్మానం చేయడం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు,మండల కమిటీ సభ్యులు,వివిధ గ్రామాల పెద్దలు, మండల కమిటీ సభ్యులు, అధ్యక్షులు పిట్ల విట్టల్ ప్రధాన కార్యదర్శి జింక పవన్,జే లా శ్రీకాంత్,మాజీ అధ్యక్షులు పిట్ల రాంగోపాల్, ఉపాధ్యక్షులు కంచం నరసింహులు, జినుకమల్లేశం, గాడ్చర్ల రామచంద్రం,విద్యాధర్, సహాయ కార్యదర్శులు గీస బిక్షపతి, జాల బిక్షపతి,సోమరి పేట నరసింహులు, నిమ్మలరాములు, వివిధ గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.